‘ భారత్ ఫస్ట్ టైమ్ రష్యాకు వ్యతిరేఖంగా ఓటు వేసింది..’ ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 15 మంది సభ్యులున్న భద్రతామండలిలో భారత్కు తాత్కాలిక సభ్యత్వం ఉన్నది. కాగా, ఇప్పటివరకు ఈ అంశంలో భారత్ ఓటింగ్కు దూరంగానే ఉంటూ వచ్చింది. పైగా ఉక్రెయిన్పై రష్యా దాడిని ఎప్పుడూ విమర్శించలేదు. ఇరు దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతూ.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ వచ్చింది. భద్రతామండలి సమావేశంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనే అంశాన్ని రష్యా వ్యతిరేకించింది. దీనిపై ఓటింగ్ నిర్వహించాలని ఐరాసలో రష్యా రాయబారి నెబెంజియా పట్టబట్టారు. జెలెన్స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అల్బేనియా రాయబారి మద్దతు పలికారు. అనంతరం జరిగిన ఓటింగ్లో భారత్ సహా 13 మంది ఉక్రెయిన్కు మద్దతుగా ఓటేశారు.