బ్రిటన్ లోని బర్మింగ్ హమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. మూత్రంలోని డీఎన్ఏ సాయంతో మూత్రాశయ క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని కనిపెట్టి వైద్యరంగంలో మరో అడుగు ముందుకేశారు. దానికి ‘గేలియాస్ బ్లాడర్’ అని పేరు పెట్టారు.
ఇది రోగిలోని క్యాన్సర్ ను గుర్తించడమే కాకుండా డీఎన్ఏలో ఎలాంటి మార్పుల వల్ల ఆ సమస్య ఉత్పన్నమైందనేది కూడా బయటపెడుతుంది. క్యాన్సర్ ఎంత మేర వ్యాపించింది అనే విషయాలు కూడా వెల్లడవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరీక్ష కోసం రోగి బ్లాడర్ లోకి సూక్ష్మ కెమెరాను చొప్పిస్తారు.