కర్ణాటక రాష్ట్రం మైసూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణకుమార్, ఆయన తల్లి చూడ రత్నమ్మ. తల్లి కల నెరవేర్చేందుకు రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాడు కృష్ణకుమార్. తల్లి చిరకాల కోరిక తీర్చేందుకు తీర్థయాత్రలకు తిప్పుతున్నాడు. భర్త దక్షిణామూర్తి మృతితో రత్నమ్మ ఇక తన కల నెరవేరదేమోనని అని ఆందోళన చెందారు. ఈ క్రమంలో కన్నతల్లి కోరికను తెలుసుకొన్న కృష్ణకుమార్, తీర్థయాత్రలు తిప్పాలని భావించాడు. ఇందుకోసం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. స్కూటర్పై తల్లిని తీసుకొని 2018లో బయలుదేరాడు. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలను చూపించాడు. 2020 కొవిడ్ కారణంగా బ్రేక్ పడింది. కొవిడ్ ప్రభావం తగ్గడంతో ఏడు నెలల నుంచి మళ్లీ యాత్ర మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తెలంగాణలోని బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తల్లి రుణం తీర్చుకునేందుకు తీర్థయాత్రలు తిరుగుతున్నట్టు చెప్పాడు. ఇప్పటికే దాదాపు 66 వేల కిలో మీటర్లు పూర్తి చేశామన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, కోల్కతా, అరుణాచల్ ప్రదేశ్తోపాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సందర్శించినట్టు తెలిపారు.