దాదాపు రూ.980కోట్ల వ్యయంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును నిర్మించారు. అతి పొడవైన తీగల వంతెన ఇదే. దీని సుమారు పొడవు 2.32కి.మీ.లు. భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్పాత్, రెండు వైపులా కృష్ణుడి చిత్రాలను కలిగి ఉంది ఈ సేతు.
ఫుట్పాత్ ఎగువ భాగాలలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ నుంచి ఒక మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వంతెన రవాణా సౌకర్యాన్ని సులభతరం చేస్తుంది. యాత్రికులు బేట్ ద్వారక చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా భక్తులు సౌకర్యవంతంగా తీగల వంతెన ద్వారా చేరుకోవచ్చు. ఈ ఐకానిక్ వంతెన ద్వారకలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా కూడా నిలిచిపోనుంది.