ఓ ఫ్యాషన్ షో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కారణం ర్యాంప్ పై క్యాట్వాక్ చేస్తున్న మోడల్స్పై చెత్త, పానీయాలను విసరడమే. మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ప్రదర్శనతో ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. ఆ ఫొటోలను మిలన్ ఫ్యాషన్ వీక్ అధికారిక ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాషన్ బ్రాండ్ ‘అవవా’ను నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. మోడల్స్పై చెత్తను వేయడం వల్ల ఇది ‘చెత్త’ ప్రదర్శన అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వచ్చిన తిరస్కరణ, వ్యతిరేకతే ప్రేరణగా చెత్తను ఉపయోగిస్తూ ఫ్యాషన్ షోలో మోడల్స్ పాల్గొనేలా థీమ్ రెడీ చేసినట్లు ఆ బ్రాండ్ యజమాని బీట్ కార్ల్సన్ ఇన్స్టా పోస్టులో పేర్కొన్నాడు. తమ బ్రాండ్ సామాజిక మాధ్యమాలలో తిరస్కారానికి గురైన విషయాన్ని మోడల్స్పై చెత్తను చల్లుతూ తెలియజేశామన్నారు. అందువల్లనే చెత్తతో నిండి ఉన్న వేదిక మీదే ఫ్యాషన్ షో నిర్వహించి విమర్శకుల నోర్లు మూయించామని తెలిపాడు. ఇక డిజైనర్ క్రియేటివిటీకి ప్రేక్షకులు, నెటిజన్లలో మిశ్రమ స్పందన వచ్చింది.