భారత్లో సెల్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒ ప్పో, కౌంటర్పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…
సెల్ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారట . 65 శాతం మంది వినియోగదారులు ఫోన్ బ్యాటరీ అయిపోతుంటే మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నారు. నోమోఫోబియా 31 – 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటోంది. ఆ తర్వాత 25 – 30 ఏళ్ల వయస్సు వారిలో ఈ ఫోబియా ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజులలో ఇలాంటి వారిలో మానసిక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధన నివేదిక చెపుతోంది.