”మన పొరుగు రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ సమయంలో అక్కడ శాసన సభలో ఉన్న వారిలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయనేది చర్చ నడుస్తోంది. ఏకంగా 32 మంది సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయట. ”
2018 శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే సమయంలోనే వీరు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. ఏడీఆర్ విడుదల చేసిన వివరాల ప్రకారం బీజేపీకి చెందిన 22 మంది, కాంగ్రెస్ సభ్యులు ఐదుగురు, జేడీఎ్సకు చెందిన నలుగురు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, మంత్రులు శ్రీరాములు, జేసీ మాధుస్వామి తదితరులున్నారు.