రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. ఏడు టన్నుల పుష్పాలను వినియోగించి సుందరంగా తీర్చిదిద్దారు. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు.
అనంతరం శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంపై ఊరేగించనున్నారు. సాయంత్రం శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు.