ఇద్దరు బాలికలకు మద్యం తాగించి ఇద్దరు యువకులు లైగింక చర్యలకు పాల్పడ్డారు. నరసరావుపేటలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. నరసరావుపేట పరిధిలోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి కోటప్పకొండకు చెందిన 17 ఏళ్ల బాలుడికి మధ్య లైంగిక సంబంధం ఉంది. అతను ఓ డ్రాన్స్ ట్రూప్ లో పనిచేస్తున్నాడు. అతడి స్నేహతుడైన మరో యువకుడు ఆ బాలిక స్నేహితురాలైన 6వ తరగతి బాలికపై కన్నేశాడు.
ఈ క్రమంలో వారిద్దరు ఆ బాలికలిద్దరినీ కోటప్పకొండ రోడ్డులో ఉన్న తమ గదికి పిలిపించుకున్నారు. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి వారితో తాగించారు. తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఆ కుమార్తెలు రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు విచారించి గదిలో నిర్బంధించిన బాలికలను గుర్తించారు. ఆ యువకులను అదుపులోకి తీసుకొని బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.