తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఇకపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కొండపూ ఇక పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలులోకి రానుంది. తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని టీడీపీ స్పష్టం చేసింది. నిన్న దీనిపై ప్రకటనలు విడుదల చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది. కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా ఏర్పాటు చేశారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్ను గుర్తించే సెన్సార్స్ అమర్చారు. అంతేకాకుండా కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్కు ప్రయమ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించింది.