దక్షిణాదిలో శ్రావణమాసం పవిత్రమైంది. హిందూ బంధువులలో చాలా మంది ఈ రోజులలో నిత్యం పూజలూ వ్రతాలే. బెంగళూరు వాసులూ శ్రావణాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ” తెల్ల వారిపోతుంది.. లే.. ఇంకా నిద్రెలాపడుతుంది యశోదా? మార్కెట్కు వెళ్లి పూజకు పూలు తీసుకురా’” అంటూ తల్లిపోరు. ‘అమెరికా నుంచి వచ్చినా.. నీ గోల తప్పదా’ అంటూ యశోద విసుగ్గా మంచం దిగింది. ‘త్వరగా వెళ్లు తల్లీ! ఎండపడితే పూలు వాడిపోతాయి. పూజకు పనికిరావు’ అంటూ బుజ్జగిస్తున్న తల్లిని చూస్తూ ఆలోచనలో పడింది యశోద. ఏ పువ్వయినా రెండు రోజులకు మించి నిల్వ ఉండదు. అంటే, మార్కెట్కు వచ్చే సగానికి సగం పూలు జనానికి చేరవు. వాడిపోయి చెత్తబుట్టలోకి వెళతాయి. ఎంత వృథా! పూలు వాడిపోకుండా..కొన్ని రోజులపాటు జీవితకాలాన్ని పెంచలేమా?’ అన్న ఆలోచనే, యశోదను ఆంత్రప్రెన్యూర్ను చేసింది. ‘హూవు ( Hoovu )’ అనే స్టార్టప్కు అదే పునాది.
చెల్లెలు తో కలసి..,