ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్.. రూ.కోట్ల టర్నోవర్!
ప్యూన్గా తన జీవితాన్ని మొదలు పెట్టి.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్గా ఎదిగారు ఓ వ్యక్తి. రూ.10 కోట్ల టర్నోవర్ను సాధించి.. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అలా ఎదగడానికి ఆయన పడిన కష్టమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఓ మారుమూల గ్రామం. చోటు శర్మ 1998లో డిగ్రీ పూర్తీ చేసారు. కంప్యూటర్ కోర్సులు చేయాలనీ కోరిక ఉంది. అయితే చోటు కుటుంబం ఆర్ధిక స్తొమత అంతగలేదు. దీంతో ఓ కంప్యూటర్ సెంటర్ లో ఫ్యూన్ గా చేరారు. పార్ట్ టైం కంప్యూటర్ కోర్స్ చేస్తూ.. క్రమంగా పట్టు సాధించారు. 2007 వరకు పలు కంపెనీలలో ఉద్యోగం చేసారు. విద్యార్థులకు కంప్యూటర్ కోర్సలు చెప్పారు. 2007లో CS ఇన్ఫోటక్ , CS సాఫ్ట్ సోలుషన్స్ అనే పేర్లతో కంపెనీలు స్థాపించాడు. ఇపుడు ఆ కంపెనీలలో 150 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఫ్యూన్ గా చేరి.. ఏకంగా కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సంస్థనే ప్రారంభించాడు చోటు శర్మ. గ్రేట్.