అగ్ర హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన సీమంతం దుబాయ్లో జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. చరణ్, ఉపాసనతో కలిసి బీచ్లో ఫొటోలు దిగారు. వీటిని ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె స్పందిస్తూ…‘నా సీమంతం వేడుకను ఇంత ఘనంగా జరిపినందుకు సోదరీలు అన్షుపాల, సింధూరిలకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది. ఈ కార్యక్రమం కోసం కొద్ది రోజుల క్రితమే దుబాయ్ వెళ్లారు రామ్చరణ్.