by Srinivas Vedulla | May 14, 2025 | జాతీయం
మేథావుల ముసుగేసుకున్న కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు గానీ...
కేవలం 24 నిమిషాలు.. పాకిస్తాన్ లో అన్ని ఉగ్రవాద తయారీ కేంద్రాలతోపాటు కీలక స్థావరాల ధ్వంసం. వందల ,వేల మంది మరణం. పైకి చెప్పుకోడానికి దాయాది దేశానికీ నోరు పెగలడం లేదు కానీ , . .పదిలక్షల కోట్ల విధ్వంసం…కోలుకోవడానికి కనీసం పదేళ్ళు పడుతుంది.కీలకమైన తొమ్మిది ఎయిర్ బేస్ లు ధ్వ0సం. వాళ్ళ స్వీయ రక్షణ వ్యవస్థలు ధ్వంసం. ఆకాశ్, బ్రహ్మోస్ ల విలయ తాండవం వాళ్ళను సమర్థించే దేశాలకు సైతం వణుకు పుట్టించింది. పహల్గామ్ ఘటన తరవాత మోడీ ఎక్కడా నోరు మెదపకుండా మీటింగ్ లపై మీటింగ్ లు పెట్టడం చూసి చాలా మంది ఎన్నికల స్టంట్ అనుకున్నారు.
కానీ మనల్ని పాక్ పై దాడులు చేయొద్దని…రెండు దేశాల మధ్యా అణు యుద్ధం జరుగుతుందనీ…పాక్ అన్నింటికీ తెగించి ఉందనీ….మీ అభివృద్ధి ఆగిపోతుందనీ…చైనా తన క్షిపణులు కొన్ని పాక్ లో మొహరించి తమ జిపియస్ ద్వారా ఇండియా లో కీలక స్థావరాలు పేల్చేయబోతోందనీ….అనేక వత్తిడులు. మొన్నటి పహల్గాం ఘటనకు కూడా ఉగ్రవాదులు చైనా జీపియస్ ని…చైనా శాటిలైట్ ఫోన్లే వాడారంటూ బెదిరింపులు. ఆఖరుకు పుతిన్ కూడా ఇప్పుడు యుద్ధం వద్దు. పాక్ కి పోయేదేం లేదు…ఇండియాకు చాలా నష్టం జరుగుతుందంటూ హితోక్తులు. ఈ నేపధ్యంలో అన్నీ అంచనా వేసుకుని...దేశ ప్రజల ఎమోషన్స్ ని పరిగణనలోకి తీసుకుంటూ….జస్ట్ టెస్ట్ మోనియల్ తరహా దాడి చేసారు. కరాచీ ఫోర్ట్ కొన్నేళ్ళపాటు పనికిరాకుండా పేల్చారు.
పాక్ కీలక స్థావరాలన్నీ మటాష్
పాక్ లో కీలక స్థావరాలన్నింటినీ ధ్వ0సం చేయగలిగాం . దీనికి అమెరికన్ జిపియస్ కాకుండా మన సొంత శాటిలైట్స్ ద్వారా టార్గెట్స్ ఫిక్స్ చేయడానికి…ఇస్రో ఉపగ్రహాలన్నింటినీ సరిహద్దుల వైపు ఫోకస్ పెట్టేదాకా వేచి చూసి…అన్నీ ఫర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి కొట్టారు.(కార్గిల్ యుద్ధంలో పదాతి దళాలతో యుద్ధం చేయాల్సి రావడానికి కారణం అమెరికా వైమానిక దాడులకు జిపియస్ సహకారం నిరాకరించడమే) పాక్ లో ఆరాత్రి రెండు సార్లు ఎర్త్ కిక్ వచ్చిందన్నారు. అది ఎందుకో కొందరికే తెలుసు. పాక్ అణ్వాయుధ దేశం కావడానికి కారణమే చైనా…అమెరికా. వాళ్ళు ఆదేశంలో మొహరించి…దాచి పెట్టిన న్యూక్లియర్ వెపన్స్…పదార్థాలు గల కాంప్లెక్స్ లు…నేల మాళిగలకు మన బ్రహ్మోస్…ఆకాశ్ బొక్కలు పెట్టాయి. అది కాస్తా అక్కడ అణు ఇంధన లీకేజీకి కారణమయింది. అమెరికా, చైనా నిపుణులు కిరాణా హిల్స్ లో వాటిని డిఫ్యూజ్ చేసే పనిలోనే ఉన్నారు. దాంతో దాడులు నిలిపారు మనవాళ్ళు. ఎందుకంటే అణు లీకేజీ పెరిగితే లక్షల మంది పోతారు.ప్రపంచం ముంగిట మనం దోషులమవుతాం. గతంలోలా రోజుల తరబడి యుద్ధం చేయలేదన్న అసంతృప్తి నాబోటివాళ్ళకు కూడా వచ్చింది. కానీ మన సామర్థ్యం ప్రకారం మనోళ్ళు ఓ నాలుగైదు గంటలు చేస్తే చాలు…పాక్ దేశం ప్రపంచ పటంలో ఉండదు.
ప్రపంచ దేశాల ఆశ్చర్యం
ఇప్పుడు ప్రపంచమే మన యుద్ధతంత్రానికి ఆశ్చర్య పడుతోంది. అమెరికా… చైనా ఇండియాను పాక్ ద్వారా దెబ్బతీయించి ఆనందపడదామనుకున్న ఆశలు నీరుగారిపోయి…వెంటనే చర్చలు కూడా జరుపుకున్నారు. పుతిన్ ని కూడా ప్రెజర్ చేయాలని చూస్తున్నారు. ఇకపై భారత్ మరింత అప్రమత్తతగా యుద్ధ సన్నాహాలు చేస్తుంది. లేజర్ ఆయుధాలతో స్టార్ వార్ కీ రఢీ అవుతుంది. ఇండియా గత పదేళ్ళుగా పాక్ ని కాకుండా చైనాను దృష్టిలో పెట్టుకునే యుద్ధ తంత్రం తయారు చేసుకుంటోంది. అది చైనాకూ తెలుసు. ఇక ట్రంప్ ప్రకటనలంటారా! తిరునాళ్ళలో రోడ్డుపై బూరలు , బుడగలు అమ్ముకునే వాడికీ వీడికీ తేడాలేదు. వాడి మాటలను వాళ్ళ దేశ జనమే నమ్మడం లేదు. పట్టూ పట్టూ వఛ్చినపుడు ఏమీ లేని స్థితిలోనే భారత్ అమెరికా మాట వినలేదు. మొన్న S400 రష్యా నుండి కొనొద్దనీ….ఆ డీల్ జరిపితే ఆంక్షలు విధిస్తామనీ…అమెరికా శతవిధాల ఆపడానికి ప్రయత్నించింది. అయినా కొనుక్కున్నాం. మన బ్రహ్మోస్…ఆకాశ్ లు పాక్ లో దీపావళి జరిపితే….వాళ్ళు పంపిన టర్కీ…చైనా పీసులను ఈ S400 తోపాటు…మన సొంత తయారీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సిస్టం కలిసి వచ్చిన వాటిని వచ్చినట్టే గాల్లోనే పేల్చి పడేశాయి.
మేడిన్ అమెరికా, చైనా విమానాలూ ఖతం
పనిలో పని అమెరికా తయారీ f16 విమాలు రెండూ…చైనా విమానాలు కొన్నింటినీ ఖతం చేసారు మనోళ్ళు. చైనా…అమెరికా ఆయుధ వ్యాపారానికి మన 24 నిమషాల దాడి లక్షల కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. వాళ్ళ ఆయుధాలపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఇండియా ఆయుధ వ్యాపార మార్కెట్ పెరగనుంది. మన ఆయుధ కంపెనీల షేర్లు ఈ రెండు రోజుల్లోనే 15-20% పెరగడమే ఇందుకు తార్కాణం. మోడీ అమెరికా కు…ట్రంప్ కీ టైం చూసి వాత పెడతాడు. పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించబోతున్నాడు. చైనా వత్తిడిని తోసిరాజని మరీ వస్తున్నాడు. అక్కడ ఉక్రెయిన్ తౌ యుద్ధంలో ఆర్థిక ఇబ్బందులో రష్యా సతమతం అవుతోంది. అందుకే అనేక కీలక ఆయుధాలను ఇండియాకు అమ్మబోతున్నాడు. అందులో S500, కొన్ని అధునాతన యుద్ధ విమానాలు అందులో బాగమే.. ఇండియాతో ఏ వ్యవహారం అయినా ఏదేశానికైనా ఇంతకు ముందులా మాత్రం ఉండదు. రాఫెల్ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే…ఇటీవల జరిగిన మరిన్ని రాఫెల్స్ కొనుగోలుకు ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షిస్తారు. ఆపరేషన్ సింధూర్ ఏమీ ముగియలేదు. కాశ్మీర్ లోగానీ భారత్ లో గానీ చిన్న టపాసు పేలితే చాలు…ఇకపై దీపావళీ…ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటారు. జైహింద్….
by Srinivas Vedulla | May 4, 2025 | అభిప్రాయం
Those who are spewing venom at Amaravati must be stopped
‘అమరావతి వల్ల ఒక సామాజిక వర్గం మాత్రమే లబ్ది పొందుతుంది. లక్ష కోట్లు ఇక్కడే పెట్టి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను వదిలేస్తారా ? ‘ ఇలాంటి విష ప్రచారాలతో 2014-2019 మధ్య కాలంలో రాజకీయంగా లబ్ది పొందడమే కాదు . . టీడీపీని , ఆ పార్టీ కీలక నేతలపై జనంలో అనుమానాలు క్రియేట్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అయింది.
జగన్ మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి జనం మూలన కూర్చోబెట్టినా.. కొందరు కీలక నేతలైతే కుదేలయ్యారు కానీ , ,ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. విష ప్రచారాలను చొప్పిస్తూనే ఉన్నారు . వీరిని కట్టడి చేయడం కూటమి సర్కార్ కి చేతకావడంలేదనే చెప్పాలి. ఒకటీ , ఆరా కేసులు పెట్టినా వాళ్లలో భయం పుట్టించలేకపోతున్నారన్న విమర్శలు కూటమి కేడర్ నుంచే బలంగా వినిపిస్తున్నాయి .
అమరావతిపై విషం చిమ్మడం ఆపలేరా ?
‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు అప్పులు చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకేచోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అంటూ ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికీ వాస్తవాలు తెలుసు . అయినా విషం చిమ్ముతున్నారు . అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయింది. హైదరాబాద్లో, అంటే సైబరాబాద్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని గుర్తు చేసుకోవాలి .
రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని వైసీపీ సోషల్ మీడియాతో పాటు , ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ గొంతు చించుకుంటూనే ఉన్నారు . ఇలాంటి వాళ్లు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ముందుకు రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్నవారు ఈ విషయం తెలుసుకోవాలి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటానికి కారణం ??? చెన్నయ్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండటం వల్లనే ఈ రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది . ఇలాంటివన్నీ ప్రజలలోకి వెళ్లేలా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలి .
మేధావుల ముసుగులో . ,
అమరావతిపై లేనిపోని విష ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా , మేధావుల ముసుగులో జనాన్ని రెచ్చగొడుతూ . . రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ప్రతి చర్యలను గమనించడానికి పోలీసు శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి . .. నిఘా ద్వారా విష బీజాలు నాటే వారిని ఆదిలోనే అడ్డుకోవాలి . లేకపోతె . .. అమరావతి అనే మహా యజ్ఞంలో విషం చిమ్మే వారు మరింత పెట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ గ్రహించి మేల్కోవాలి. మెతక వైఖరి వీడి , అరాచకవాదులపై కొరఢా ఝళిపించాలి .
by Srinivas Vedulla | Apr 29, 2025 | ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలకే బిజెపిలో పెద్దపీట – ఇది ఎపిలో వ్యూహం – నాలుగు దశాబ్దాల నిబద్దత కలిగిన కార్యకర్తకు రాజ్యసభ
పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, అత్యంత విధేయతతో సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. రాజకీయంగా ఉనికి కోసం యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఇది మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .
నమ్మకంతో కట్టుబడి పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఊహించలేనంత పెద్ద అవకాశాలు ఇవ్వగలమన్న సంకేతాలను బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది కాలంలోనే కల్పించింది .
పక్కజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా కు తెలియని బి. శ్రీనివాసవర్మకు నరసాపురం నుంచి లోక్ సభ టికెట్ ఇచ్చారు. జగన్ వ్యతిరేకప్రభంజనంలో వర్మగెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు.
రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు విజయసాయిరెడ్డి స్ధానంలో పి వెంకట
సత్యనారాయణను ఎంపిక చేసినట్టు బిజెపి ప్రకటించింది. కూటమి బలం కారణంగా ఆయన ఎన్నిక ఎన్నిక కేవలం లాంఛనమే!
శ్రీనివాస్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా స్థాయి లో పార్టీపరంగా అనేక బాధ్యతలు నిర్వహించారు. సత్యనారాయణ బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ గా వున్నారు. ఇద్దరిదీ భీమవరమే! ఇద్దరూ స్వయం సేవకులే! ఇద్దరూ పటాటోపాలకు దూరంగా వుండే కార్యకర్తలుగా గుర్తింపు పొందినవారే కావడం గమనార్హం. బిజెపి బలంలేని ఆంధ్రప్రదేశ్ లో పెద్దపెద్ద పదవులు వున్నవారి ప్రభావం కూడా సహజంగా తక్కువగానే వుంటుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చిన్నగా విస్తరిస్తోంది. బిజెపికి పార్లమెంటులో ఆధిక్యత వున్నపుడు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు మొదలైన అనేక అంశాల్లో దగా చేసినందుకు ప్రజలు ఆపార్టీ ప్రజలు ఆగ్రహంగా వున్నారు. 2024 ఎన్నికల్లో మెజారిటీలేక తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో (రాష్ట్రంలో కూడా) కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక “పట్టి విడిచినట్టు” రాష్ట్రం కోర్కెలను కేంద్రం చిన్నగా తీరుస్తోంది. ఇందువల్ల ప్రజల ఆగ్రహం తగ్గింది. ఒకప్పుడు పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేని ఎపిలో బిజెపి సభ్యత్వాల సఖ్యపెరుగుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1 లక్షా 50 వేలమంది కంటే ఎక్కువ మందే బిజెపిలో సభ్యులుగా వున్నారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి ఏ నియోజక వర్గంలోనైనా పాతిక ముప్పై మంది క్రియాశీలక సభ్యులే పార్టీకి వున్నారు.
కొద్దినెలల క్రితం బిజిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్సీ పదవి దక్కింది. బిజెపి, తెలుగుదేశం మధ్య పొత్తు వున్న కాలంలోనే వీర్రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు కి వ్యతిరేకంగా విమర్శలు చేసి రెండుపార్టీల మద్య వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అలాంటి వీర్రాజు మళ్ళీ ఎమ్మెల్సీ కావడం అనూహ్యమే! టీడీపీని కాదని వీర్రాజు ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా ఎమ్మెల్సే కొట్టగలిగారు . అదీ బీజేపీలో జరిగే రాజకీయం . చంద్రబాబు విధిలేక ఒప్పుకోవడం లేదా హుందాగా అంగీకరించడంలో బిజెపి మేనేజిమెంటు చాతుర్యం కూడా వుంది.
తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిలో పార్టీ బలం పెంచుకోడానికి సొంత ఎత్తుగడలు వున్నాయి. తెలుగుదేశంపార్టీ తన ఎమ్మెల్యేలు లేనిచోట ఇంచార్జ్ లను నియమించి వారి ద్వారా రోజువారీ పాలనలో కూడా జోక్యం చేసుకుంటోంది. జనసేనకు పవన్ కళ్యాణ్ నాయకత్వం తప్ప సంస్ధాగత నిర్మాణం దాదాపు లేదనే చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ అధికార కేంద్రాలు బలపడుతున్నాయి. తెలుగుదేశం ఇన్ చార్జ్ వ్యవస్థకు జనసేన అధికార కేంద్రాలకు మధ్య స్పర్ధలు వున్నాయి. అవి రోడ్డున పడే పరిస్ధితి ఇప్పట్లో వుండకపోవచ్చు .
పార్టీ కమిట్ మెంట్ ఉంటే పదవి అదే వస్తుంది
పార్టీకి కట్టుబడిన వారికే పదవులు అనే బిజెపి ఎత్తుగడ, లాయలిస్టుల్లో నిరాసక్తత ను తొలగించి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అది ఆ పార్టీ విధానం… దానిని తప్పుపట్టడం పెద్దతప్పే అవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతోంది. “ఎంతపని చేసినా ఇంతే! లాయల్టీకి గుర్తింపు గౌరవం లేవు. బాబు మారడు. అధికారంలో లేనపుడు కార్యకర్తలే ప్రాణ సమానం అంటాడు. అధికారంలోకి వచ్చాక అదంతా మరచిపోతాడు……” ఇలాంటి కామెంట్లు తెలుగుదేశంలో తరచూ వినిపిస్తుంటాయి.
ఏరాజకీయ పార్టీ అయినా బలంపెంచుకోవలసిందే! అయితే ప్రజల్లోకి వెళ్ళడానికంటే కంటే కేంద్రం లో వున్న అధికారాన్ని ఇందుకు ఉపయోగించడం ఒక నైతిక ప్రశ్న! బిజెపికి ఇలాంటి నైతికమీమాంసలేమీ వుండవు అని రకరకాల పరిణామాల ద్వారా దేశప్రజలందరికీ తెలుసు!
బీజేపీ మింగేస్తుంది
బిజెపికి అవకాశం వచ్చినపుడు, ఇతరపార్టీలు ఆదమరచి వున్నపుడు బిజెపి ఆన్ని విధాలా ఆక్రమించేస్తుందని జనసేన కు తెలుస్తుందోలేదో కానీ , , తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ మర్మం ఖచ్చితంగా తెలుసు. అయినా కొన్ని పదవులు , కొన్ని పనులు వ్యవహారంలో వైసీపీకి సపోర్టుగా ఉండే బీజేపీ నేతలకు సైతం పెద్ద పీట వేయాల్సి రావడం టీడీపీ కి గత్యంతరంలేని పరిస్థితిగా కనిపిస్తోంది . అమరావతి , పోలవరం వంటి వాటిని నెరవేర్చాలంటే బీజేపీ పెద్దల అండదండలు కావాల్సిందే . అందుకోసం కొన్నింటిలో కాంప్రమైజ్ కాక తప్పడంలేదు .
by Srinivas Vedulla | Apr 28, 2025 | ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాలలో అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ ప్రిన్సిపాల్ గా డాక్టర్ అత్తలూరి విష్ణ వర్ధన్ నియమితులయ్యారు . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధ0గా ఉన్న మెడికల్ కాలేజీలో అనస్తీసియా విభాగం HOD గా విధులు నిర్వహిస్తున్న విష్ణు రెండేళ్లుగా ఇదే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు . డాక్టర్ విష్ణు వర్ధన్ కు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ గుర్తింపుతోపాటు , పేషేంట్స్ పట్ల సేవాభావం చూపుతారని మంచి పేరుంది . 1997లో కాకినాడ జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన విష్ణు తర్వాత 2006లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పదోన్నటి పొందారు . 2015 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు . 2018 లో విష్ణు సేవలకు గాను , ప్రభుత్వం నుంచి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు .