మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతో టీడీపీ అధినేత చంద్రబాబుకి బలమైన అనుబంధం ఉంది, 1996లో ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిగా దింపేసి.. చంద్రబాబును పదవిలోకి లెక్కించడంలో అప్పటి స్పీకర్ యనమల సహకారం కీలకం. అయితే అదొక్కటీ ఇన్నాళ్లు యనమలకు టీడీపీలో అత్యంత ప్రాధాన్యత కొనసాగడానికి కారణమా? కాదు.. ఇంకా బయటకు తెలియని లాలూచి ఇద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుందనేది టీడీపీ కేడర్ లో బలంగా వినిపించే వాయిస్.
2004, 2009, 20014, 2019.. వరుసగా తుని అసెంబ్లీ నుంచి టీడీపీ ఓటమి పాలవుతున్నా… యనమలకు సీటు విషయంలో ఢోకా లేదు. 2014, 2019 రెండు దఫాలుగా యనమల సోదరుడు కృష్ణ ఓటమి చెందారు. 2014 లో యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి పోటీ చేస్తే ఓడిపోతారని భావించి సోదరుడు యనమల కృష్ణుడికి టికెట్ ఇప్పించారు. కృష్ణుడు కూడా ఓడిపోయారు. 2014లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు క్యాబినెట్ లో యనమలకి కీలకమైన ఆర్ధిక మంత్రి పదవి దక్కింది.
ఈ పదేళ్లలో తునిలో కృష్ణ రాజకీయంగా బలపడ్డారు. 2024 అసెంబ్లీ టికెట్ కృష్ణకృ ఇస్తే గెలిచేవారు. అయితే కృష్ణను తప్పించి… యనమల పెద్ద కుమార్తె దివ్యకి టికెట్ ఇప్పించుకున్నారు.
చిన్న అల్లుడు, కడప జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ … ఏలూరు పార్లమెంట్ సీటు ఇప్పించుకున్నారు. రాయలసీమ నుంచి గోదావరి జిల్లాలకు తీసుకువచ్చి.. పోటీ చేయించడం వల్ల ఈ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ కేడర్ లో యనమల ప్రభావం వల్ల టీడీపీ పైన, చంద్రబాబుపైనా వ్యతిరేఖత తీసుకువస్తోంది. ఇప్పటికే మహేష్ యాదవ్ తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీయే నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో సుధాకర్ యాదవ్ కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. అప్పట్లో క్రైస్తవ సమావేశాలలో పాల్గొన్నారని ఆయనపై అభియోగాలు కూడా వచ్చాయి.
ఈ అంశాన్ని చంద్రబాబు వద్దకు టీడీపీ నేతలు తీసుకువెళ్ళడానికి భయపడుతున్నారు. ఇది రాజకీయంగా టీడీపీకి , యనమల కుటుంబానికి కూడా నష్టం కలిగించే అంశమే. పార్టీ వేవ్ సునామీలా వస్తే ఆ ప్రభావం కనిపించదు కానీ, కొంచెం అటు, ఇటు వస్తే తుని అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్ ఓటమి తప్పదు. టీడీపీ అధిష్టానం ఇందుకు మూల్యం చెలించుకోవాలి.