”ఆ ఇద్దరు నేతలు పార్టీలో సీనియర్స్. పార్టీని ఉపయోగించుకుని ఇద్దరూ బాగా ఆర్ధికంగా ఎదిగినవారే. యనమల రామకృష్ణుడు 1983 నుంచీ టీడీపీలో మంత్రిగా, స్పీకర్ గా, అధికారంలేనపుడు PAC చైర్మన్ గా , ఎమ్మెల్సీ గా ఎప్పుడూ కీలక పదవులలో ఉంటారు. కాదు. చంద్రబాబు ఆయనకు ఆ ప్రత్యేకత కల్పిస్తారు.
మరో నేత నిమ్మకాయల చిన రాజప్ప. 2014-2019 మధ్య డీప్యూటీ సియ0, హోంమంత్రిగా కీలక పదవిలో ఉన్నారు. ఆయన సామర్డ్య0 మాటెలా ఉన్నా.. ఏమి చెపితే అది చేస్తారన్న నమ్మకంతో చంద్రబాబు కూడా రాజప్పకు అత్యంత కీలక పదవి కట్టబెట్టారు. ఆ ఐదేళ్ల సమయంలో రామేశం మెట్ట మైనింగ్ లో కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని రాజప్పపై సొంత పార్టీ నేతలే చంద్రబాబుకు అనేక ఫిర్యాదులు చేసారు. అయినా చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇదంతా చరిత్ర. ఇపుడెందుకు అంటారా?
2024 ఎన్నికలలో రాజప్ప పెద్దాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టి వెనకేసిన సొమ్ము తీయడానికి బాధగా ఉందొ ఏంటో తెలియదు కానీ, చందాలు కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికే రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల నుంచి భారీగానే విరాళాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
తుని నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీలో ఉన్నారు. అక్కడ ఎన్నికల ఖర్చుల కోసం యనమల కూడా విరాళాల సేకరణలో ఉన్నారు. ‘‘పార్టీ కోసం ఖర్చు చేయడానికి ఎప్పుడు ముందుకు రారు. కానీ వీళ్ళ కోసం పార్టీ ఖర్చు చేయాలి. ఈ ధోరణిని పార్టీలో కొందరు … వీళ్ళకి మనం ఏ జన్మలోనో బాకీ ఉండి ఉంటాం.. లేకపోతె.. ఏంటీ..” అంటూ వ్యంగంగా వ్యాఖ్యానిస్తు0టారు. ”
యనమల, రాజప్ప వేర్వేరుగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై ఒత్తిడి చేస్తున్నట్లు విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. వాళ్ళే ఎన్నికల ఖర్చు కోసం జనం మీద పడుతుంటే.. ఓ మోస్తరుగా ఉన్న అభ్యర్థుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అనపర్తి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఆర్ధిక స్తొమత లేని నేతలు పార్టీ నుంచి.. ఇతరుల నుంచి విరాళాలు ఆశించడం తప్పుకాదు.. కానీ భారీగా వెనకేసుకున్న నేతలే ఇలా చేయడం కరెక్ట్ కాదని టీడీపీ వర్గాలే వ్యతిరేకిస్తున్నారు. అయితే అధినేత చంద్రబాబు వ్యవహారశైలి వల్లే రాజప్ప, యనమల ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా పార్టీ కేడర్ లో వినిపిస్తున్న మాట. ఇలాంటివి ఎన్నికల నాటికైనా చక్కబెట్టుకోకపోతే టీడీపీకి నష్టం చేస్తాయ్.