టీటీడీ సెక్యూరిటీ వద్ద దర్పం చూపాడు. అఖిల భారత సర్వీస్ అధికారినంటూ హడావుడి చేసాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్ను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేయాలని సిఫార్సు లేఖను ఇచ్చాడు.
అనుమానామ్ వచ్చిన టీటీడీ ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసారు. నరసింహమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ అని తేలడంతో తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నరసింహమూర్తి ఐఏఎస్ అధికారే కాదని స్పష్టమైంది. గతంలో కూడా ఇలానే గుంటూరు, విజయవాడల్లో మోసాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.