వైసీపీ సర్కారును ఎలాగైనా గద్దె దించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. దీనికోసం బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు సైతం పవన్ ఏ మాత్రం వెనుకంజ వేసేలా కనిపించడంలేదు.
“వైసీపీ వ్యతిరేఖ ఓటు చీలనివ్వమ్” పవన్ కల్యాణ్ ఆరేడు నెలల నుంచీ ఘంటాపధంగా చెపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో “దేశం-సేన” పొత్తుకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఏయే సీట్లలో ఎవరు పోటీ చేస్తారు? అనే దానిపై అపుడే రాజకేయంగా చర్చలకు తెర లేచింది. ముఖ్య0గా జనసేనకు పట్టున్న పూర్వ ఉభయ గోదావరి జిల్లాలలో ఆ పార్టీ ఏయే అసెంబ్లీ సీట్లు అడుగుతారనేదానిపై జనసేన-తెలుగుదేశం పార్టీలలోను డిస్కషన్ నడుస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. ఇది తమకు బాగా కలసివస్తుందని టీడీపీ-జనసేన నేతలు ఆశపడుతున్నారు.
పశ్చిమ గోదావరి: ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా ప్రస్తుతం రెండు లోక్ సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లలో నర్సాపురం, ఏలూరు, భీమవరం, ఉంగుటూరు అసెంబ్లీ సీట్లపై జనసేన ఆశావహులు కన్నేశారు. 2019 వైసీపీ గాలిలో కూడా గెలుపొందిన పాలకొల్లు అసెంబ్లీ కూడా తమకు కేటాయించాలని కొందరు జనసేన నేతలు పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బలమైన కేండేట్ కాబట్టి ఆ స్థానాన్ని జనసేనకు వదిలే ప్రసక్తే లేదని ‘టీడీపీ’ నేతలు స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. ఈ దఫా ఖచ్చితంగా ఆ సీటు జనసేన ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతున్నారు.
తూర్పు గోదావరి: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు విస్తరించి ఉంది. రాజమండ్రి పరిధిలో రాజానగరం, కొవ్వూరు అసెంబ్లీ సీట్లు, అమలాపురం లిమిట్స్ లో కొత్తపేట, రాజోలు, రామచంద్రపురం స్థానాలు జనసేన అడిగే అవకాశం కనిపిస్తోంది. జనసేన 2019లో గెలుపొందిన ఏకైన స్తానం.. రాజోలు. అభ్యర్థి మారినా.. రాబోయే ఎన్నికల్లో కూడా రాజోలు జనసేనకు కావాలని పట్టుపట్టే ఛాన్స్ ఉంది. ఇక కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ రూరల్, పిఠాపురం, తుని అసెంబ్లీ సీట్లు కూడా తమకు కావాలని స్థానిక జనసేన నాయకత్వం అధినేత పవన్ పై ఒత్తిడి తెస్తోంది.
2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో 6 శాతం ఓట్లకు పరిమితమైన జనసేనకు ఈ దఫా కొంత పర్సెంతేజ్ పెరిగే అవకాశం ఉంది. 7-9 శాతం ఓట్లు రావచ్చన్న అంచనా నెలకొంది. అయితే జనసేన విడిగా పోటీ చేస్తే ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఒక చోట కూడా ఖచ్చితంగా గెలుస్తుందన్న భరోసా ఆ పార్టీ నేతలకు సైతం లేదు.
టీడీపీతో పొత్తు ఉన్న పక్షంలో ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో 6 నుంచి 8 సీట్లు జనసేనకు పోటీ చేసే ఛాన్స్ వస్తే మెజార్టీ సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని రాజకేయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ బలంగా ఉన్న పిఠాపురం, కాకినాడ రూరల్ వంటి సీట్లు పట్టుపడితే ఇరు పార్టీలకు రాజకీయ పరంగా కొంత ఇబ్బంది పడవచ్చు. మొత్తం మీద జనసేన-టీడీపీ మధ్య పొత్తు పొడిస్తే.. ఇరు పార్టీలకు లాభించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయ్.