జనసేన .. పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు. కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలిగించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి వేమన పద్యాలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఫోటోను ట్వీట్ చేసి ఘాటు విమర్శలు చేశారు.
‘విద్యలేనివాడు విద్వాంసుచేరువనుండగానే పండితుండుగాడు.. కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు..విశ్వదాభిరామ! వినుర వేమ!. తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం’అంటూ పద్యంతో పాటూ తాత్పర్యాన్ని ప్రస్తావించారు.
‘ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు.. పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?.. విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు’అంటూ మరో ట్వీట్ చేశారు.