యుద్ధం.. జరిపే ఇరు దేశాలకే కాదు… అంతర్జాతీయ సమాజంలోనూ అలజడి సృష్టిస్తుంది. యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పాలని మానవత్వం ఉన్న ప్రతివారూ కోరుకుంటారు.
వేలమందిని బలితీసున్న రష్యా ఉక్రేయిన్ యుద్ధాన్ని ఆపాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట కు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు రూపొందించిన సైకత శిల్పం స్ఫూర్తిని నింపుతుంది. సోహిత, ధన్యత .. కలసి రూపొందించిన . రష్యా ఉక్రేయిన్ పిడికిళ్ళు బిగించి భూగోళాన్ని గుద్దుతున్నట్టు…. భూగోళం భయంతో యుద్ధం ఆపమంటూ ప్లకార్డు చూపుతున్న సందేశాన్ని ఇందులో తీర్చి దిద్దారు. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపేందుకు దేవిన సిస్టర్స్ ఇప్పటికే అనేక సైకత శిల్పాలను రూపొందించారు.