“I’m not a scientist, I’m not an environmentalist. I belong to the land, not to the lab, but I know there’s a soil crisis so I’m talking to as many heads of state, politicians, leaders, top scientists and influencers [as possible],” said Sadhguru. (ది గార్డియన్ పత్రిక ఇంటర్వ్యూలో సద్గురు వ్యాఖ్యలు)
” నేను శాస్త్రవేత్తను కాదు. పర్యావరణవేత్తను కాదు. నేను భూమికి చెందిన వాడిని. అందుకే నాకు భూమికి జరగబోయే పెను విపత్తు నాకు తెలుసు. భూసారాన్ని కాపాడుకునేందుకు “సేవ్ సాయిల్” ఉద్యమం ద్వారా ముందుకు వెళదామని అనేకమంది రాజకేయ నాయకులు, సైంటిస్టులు, పాలకులు.. ఇలా అందరినీ కోరుతున్నాను.”
అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు ఇచ్చారు. మట్టి వినాశన సంక్షోభాన్ని నివారించేందుకు సద్గురు ఒంటరిగా చేపట్టిన ఈ యాత్ర ఓ కీలక ఘట్టం కానుంది.
లండన్ లో సద్గురు సోమవారం 30 వేల కిలో మీటర్ల బైక్ ర్యాలీని మొదలుపెట్టారు. 100 రోజుల బైక్ జర్నీ లండన్ టు ఇండియా., ప్లాన్ చేసారు. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలలో పయనించి ఇండియాలో కావేరి బేసిన్ కు చేరుకుంటారు. ఈ సందర్బంగా సద్గురు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ” ది గార్డియన్” కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈనెల 19న సద్గురు ఇంటర్వ్యూ ను గార్డియన్ ప్రముఖంగా ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి గణాంకాలు ఈ ఇంటర్వ్యూ లో వివరించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం భూమి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయిందని, రాబోయే 50 ఏళ్లలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని సద్గురు ఆందోళన చెందుతున్నారు. “భూసారాన్ని కాపాడుకుందాం..” అనే ఈ ఉద్యమం ద్వారా ప్రపంచ దేశాలను, ప్రపంచ స్థాయి నాయకులను,ప్రజలను కార్యోన్ముకులను చేయడం ద్వారా ఈ విపత్తును కొంత వరకైనా నిలువరించాలని సద్గురు చేస్తున్న ఈ భూసార ఉద్యమ యజ్ఞానికి మనమూ చేతులు కలుపుదాం. భూమికి మనం చేస్తున్న నష్టాన్ని కొంతైనా ఆపుదాం. మన వారందరికి అవగాహన కలిగిద్దాం. లేకపోతే భావి తరాలకు మనం తీవ్రమైన అన్యాయం చేసినవారమే అవుతాం. ఆలోచించండి.
Good article sir
Great 🙏🏻🙏🏻🙏🏻