తొలి ఏకాదశిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.