ఏపీలో ఎన్నికలు సమపీస్తుండడంతోప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు.
ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. 15న విశాఖలో ప్రధాని రోడ్ షో ఉండగా, 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగే టీడీపీ-జేఎస్-బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను చంద్రబాబు ప్రకటించారు.
విభజన హామీలను నెరవేర్చడం వంటివి బహిరంగ సభలో ప్రధాని మోదీ కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీడీపీ, బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.