నటి పూనమ్ కౌర్ తెనాలికి చెందిన గీతాంజలి మరణంపై ట్వీట్ చేశారు. మృతురాలికి న్యాయం జరగాలంటే, దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది.
‘అసలు గీతాంజలి విషయంలో ఏం జరిగింది.. ఆమె ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించండి. గీతాంజలి పిల్లలకు న్యాయం చేయండి’ అంటూ పూనమ్ డిమాండ్ చేశారు.