‘నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయి. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక మైనార్టీని, పేద వర్గాలను మాత్రమే నమ్ముకున్నాను’’ అని ఏపీ సీఎం జగన్మోహాన్ రెడ్డి రాజమండ్రి సభలో తెలిపారు. జగన్ ఈ మాట చెపుతున్నపుడు జనంలో నవ్వులే..నవ్వులు. మరి సాక్షి టీవీ, పత్రిక ఎవరివి? అంటూ ఒకటే జోకులు. జనం ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ కూడా లేకుండా మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికీ కరెక్ట్ యేన .. అంటూ పలువురు రాజకీయ, సామాజిక విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
Tags: jagan speech