తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసే పాటను తెలుగుదేశం పార్టీ నిన్న విడుదల చేసింది. ఆ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే రాముని తీరు.. శ్రీరాముని తీరు అని పాట స్టార్ట్ అవుతోంది. సమరం చేద్దాం అంటూ సైన్యం కదిలి వచ్చే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు. ఒక ఉద్యమం పుట్టింది సీమాంధ్రుల కోసం, రాక్షస పాలన చేస్తాం రా అంతం. మీ కత్తులకు మా నెత్తురు తల వంచదు. ధూం ధాం దుంకి ఆడతాం. జగన్ నిన్ను తరిమి కొట్టేందుకు ప్రతి ఆంధ్రుడు కదిలాడు అనే పదాలతో యువతలో జోష్ నింపారు.