తెలుగు రాష్ట్రాలలో ఏటా రూ 2 వేల కోట్ల మేర మంచి నీటి వ్యాపారం వెనుక దాగి ఉన్న కఠోర నిజాలను దాసేస్తున్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో డబ్బా (క్యాన్)నీళ్ల కోసం నెలకు రూ 500 వరకు ఖర్చు చేస్తున్నారు. మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్న నీళ్లు ఏమాత్రం సురక్షితం కానివని ఇటీవల పలు పరీక్షలలో తేలింది. హానికర బ్యాక్తీరియా అయిన — ఎస్. రేషియా కోలి, సూడోమోనాస్ , సాల్మొనెల్లా—-వంటివి ఉన్నాయి. ఇలాంటి తాగితే ప్రాణాంతక రోగాలు సోకడం ఖాయమని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు.
{ 90 శాతం నీటి నమూనాలో ఖనిజాలు లేవు. ఇలాంటి నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.
–మూడోవంతు శాంపిళ్ళలో ఈకోలీ కన్పించింది. దీని వలన వాంతులు, విరేచనాలు, వంటి వ్యాధులు సోకుతాయి. ఇంకా అనేక ఈకోలీ కారణం అవుతుంది.
–శుద్ధి చేసిన తర్వాత రోజులుగా నీరు నిల్వ ఉండటం వల్ల సురక్షితం కాదు.
–ఇటీవల నిర్వహించిన అనేక పరీక్షలలో #మినరల్# వాటర్ అని చెప్పి అమ్మే క్యాన్ వాటర్ లో తాగడానికి 45 శాతం నీరు సురక్షితం కాదని తేలింది.
RELATED POSTS