భోగి పండుగ (ఉత్తరాదిలో లోహ్రి) పురస్కరించుకుని అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ శుక్రవారం ఒక 3డి వీడియోను విడుదల చేసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనుల తీరును ఈ వీడియోలో వివరించింది. ట్విటర్ వేదికగా పంచుకున్న ఈ వీడియో నిడివి 5 నిముషాలు ఉంది. ఆలయం పునాది నుంచి పైకప్పుదాకా ఈ వీడియోలో చూపించారు. ఆలయానికి వెళ్లే మార్గంతోపాటు గతంలో నిర్మించిన రామమందిరం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మందిరం పనులు ఏరియల్ వ్యూలో చూపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న శ్రీరామమందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఆలయానికి చెందిన రెండుదశల పనులు ఫేజ్-1, ఫేజ్-2 పూర్తయ్యాయి. ఆలయం పనులు 2023నాటికి పూర్తి చేసి, ఆ ఏడాది డిసెంబరు నుంచి భక్తులకు దర్శనానికి అనుమతులు ఇస్తామని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ పేర్కొంది.