ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. పథకంలో భాగంగా సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయం చేస్తారు. స్థలం లేని వారికి స్థలంతోపాటు రూ.5లక్షలు ఇస్తారు. ఏడాది 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సింగిల్ బెడ్రూం, కిచెన్, అటాచ్డ్ వాష్రూం, హాల్, కామన్ బాత్రూం, ఇంటిపైకి వెళ్లేందుకు మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు జాగా, బాల్కనీ, బైక్ పార్కింగ్ కోసం స్థలం, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం 4,16,500 ఇళ్లు మంజూరు చేసింది ప్రభుత్వం.