‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అనుబంధం మరింత బలపడిన టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సొంత అన్నదమ్ముల్లా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా వీద్దరూ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ వెళ్లారు.
ఈ సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొనేందుకు తారక్ బెంగళూరుకు బయల్దేరారు. ఒకే సమయంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారు కలుసుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. తారక్, చరణ్ ఇద్దరూ చాలా కాలం తర్వాత ఒకేచోట కనపించడం అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.