ముంబైకి చెందిన షబ్నమ్ షేక్ అనే యువతి తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని సైకిల్ యాత్ర ప్రారంభించింది. తన స్నేహితుడుతో కలిసి ఆమె దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే యాత్ర చేపట్టినట్టు తెలిపింది.
ఇప్పటికే మహరాష్ట్రలోని రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు వారు. రోజుకు 80 నుంచి 90 కిలో మీటర్లు సైకిలు తొక్కుతూ మరో వారంలో యాత్రను పూర్తి చేస్తానని చెబుతోంది షబ్నం. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని బడ్వానీ జిల్లాకు చేరుకుంది. రాష్ట్రంలోని ఓంకారేశ్వర్ వద్దకు.. ఆ తర్వాత ఉజ్జయినిలోని మహాకాల్ కు వెళ్లనున్నట్టు చెప్పింది.