”2109 ఎన్నికలలో వైసీపీని గద్దెనెక్కించడానికి లెక్కలేనన్ని అరాచకాలకు, కుయుక్తులకు పాల్పడిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ని మేధావులతో పాటు, టీడీపీ కేడర్ కూడా గట్టిగా విమర్శించింది. సామాజికవేత్తలు పీకే పన్నాగాలను ఛీ కొట్టారు. జగన్ ని గెలిపించడానికి అడ్డదారులు తొక్కిన పీకే ఇపుడు మనకు అవసరమా? పీకే వస్తే అన్యాయంగా గెలిచామన్న అపప్రద వస్తుంది. పార్టీకి ఇపుడున్న పరిస్థితులలో టీడీపీ గెలుపు ఖాయం.. అయితే పీకే వ్యూహాలతోనే గెలిచాం.. అనే పేరు మాత్రం అతనికి పోతుంది. కార్యకర్తల కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది…” అంటూ టీడీపీ కేడర్ లో పీకే వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్షములో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డిపై కోడికట్టి దాడి, పులివెందులలో వైఎస్ వివేకానంద్ రెడ్డి మర్డర్.. వంటి అనేక అంశాలలో పీకే వ్యూహాలపై అప్పట్లో ప్రతిపక్షాలు, మీడియా అనుమానాలు వ్యక్తం చేయడం, పీకే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం వంటివి చోటుచేసుకున్నాయి. వీటిని చంద్రబాబు, లోకేష్ మర్చిపోయారా? అంటూ కేడర్ గుర్తుచేస్తోంది. పీకే మనస్త్వత్వానికి, జగన్ మెంటాలిటీకి మ్యాచ్ అవుతుంది.. కానీ, చంద్రబాబు సున్నితత్వాన్ని, పీకే అరాచకాలకు సెట్ కాదట.. అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి.
పీకే లేకపోయినా టీడీపీ గెలుపు ఖాయం.. అక్రమంగా జైలులో పెట్టిన తర్వాత చంద్రబాబుపై రాష్ట్రంలో మరింత సింపతీ వచ్చింది. అప్పటికే బలంగా ఉన్న పార్టీ జైలు తరువాత మరింత స్ట్రాంగ్ అయింది. ఈ దశలో పలు సర్వేలు సైతం టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే.. అంటూ ఇప్పటికే నివేదికలు వెల్లడించాయి. ఇవన్నీ చూసుకుని.. ప్రశాంత్ కిషోర్ వచ్చి వాలిపోయారు.