”2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పన్నాగాలతో కీలకంగా వ్యవహరించారు. వ్యవస్థలు భ్రష్టు పట్టినా, సామాజిక హితం పట్టించుకోకుండానే పీకే గెలుపు వ్యూహాలను రూపొందిస్తారు..”
తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తో భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జనతాదళ్(యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపుపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముక్యంగా గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసేందుకు పీకే టీమ్ చేసే కుయుక్తులు అన్నీ-ఇన్నీ కావనేది మేధావులు అభిప్రాయం,. పీకే- చంద్రబాబు భేటీ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.
రాబిన్ శర్మ … పీకే శిష్యుడిగా పేరొందిన రాబిన్ శర్మ టీడీపీకి స్టేటజస్ట్ గా ఉన్నారు. పీకే రాకతో రాబిన్ టీమ్ కి వేరే పనులు అప్పగిస్తారని పార్టీ కీలక నేతలు చెపుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలలో మాంచి జోష్ మీదున్న టీడీపీ కేడర్ కి పీకే కలయిక మరింత ఊపునిస్తోందనడంలో ఎలాంటి సందేహంలేదు.