” 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకు ఒప్పుకొని తెలుగుదేశానికి పాలేరు తనం చేస్తావా?” అంటూ కాపు మేధావులు పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతూ.. కాపు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వెనుక వైసీపీ హస్తం ఉందన్న విషయాన్ని జనసేనలో కొందరు గుర్తిస్తున్నా.. అగ్రిసివ్ గా ఉండే కొందరు యువకులు మాత్రం పవన్ నిర్ణయాన్ని ఇటీవల వరకు తీవ్రంగా వ్యతిరేకించారు. తాడేపల్లిగూడెం సభ తర్వాత మాత్రం కాపు యువతతో పాటు, పవన్ అభిమానులు, జన సైనికులలో మెజార్టీ జనం ఆలోచనలో పడ్డారు. బలాలు-బలహీనతలపై జనసేన కేడర్ కి పవన్ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.
చేగొండి హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి కాపు కురువృద్దు నేతలు కాపు కుల యువతను రెచ్చగొట్టడం ద్వారా తమ ప్రాధాన్యత పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎవరి నాయకత్వ్యం అయినా కొన్నాళ్లే హవా ఉంటుంది. ముద్రగడ, జోగయ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, ముక్యంగా కాపు కులంలో మూడున్నర దశాబ్దాలు వెలిగారు.
ముద్రగడ వ్యూహం ఏమిటీ? 2014-2019 టీడీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబును కావు ఉద్యమం పేరుతొ ముద్రగడ పద్మనాభం ముప్పుతిప్పలు పెట్టారు. లేఖల ద్వారా అప్పట్లో కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాకా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా కాపు ఉద్యమాన్ని ముద్రగడ అటకెక్కించారు.
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ వస్తున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా టెంప్ట్ కాకుండా కాపులను, జనసేనను అభిమానించే ఇతర కులాల యువతను సమన్యం చేసుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికలలో జనసేన ఓట్లను చుసిన తర్వాత పవన్ .. ఆలోచనలో పడ్డారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్ల గల్లంతుతో పవన్ వాస్తవాలను గ్రహించారు. ఈ పరిణామాలను అధ్యయనం చేసుకుని.. టీడీపీతో పొత్తుతో 24 సీట్లకే పరిమితం అవ్వడానికి పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచ్ ఉంది. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్లి మరోమారు పరువు పోగొట్టుకోవడం పవన్ కి ఇష్టం లేదు. ఇపుడు వచ్చే ఓట్లతో రాజకీయ భవిష్యత్తును సమాధి చేసుకోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని బలంగా నమ్మిన పవన్.. భవిష్యత్ రాజకీయాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, జగన్ అరాచకాలను అడ్డుకోవడం కోసం.. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు. ఈ పరిణామాలు, రాజకీయ పరిస్తుతులను జన సైనికులు అర్ధం చేసుకునే దిశగా వారిని సిద్ధం చేసిన పవన్ కు రాజకీయ భవిష్యత్తు ఉందనడం అతిశయోక్తి కాదు.