”అవినాష్ రెడ్డి నిందితుడు కాదని అసెంబ్లీ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా సమర్థిస్తారు? దీంతోనే అప్పట్లో సిట్ దర్యాప్తు పక్కదారిపట్టింది..” హత్యకు గురైన వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సీఎం జగన్ పై ఎక్కుపెట్టిన బాణం తో వైసీపీ గిలగిలలాడుతోంది. వివేకా హత్య నెపాన్ని అప్పట్లో జగన్ అండ్ కో టీడీపీ పై వేశారు. ‘నారా సుర రక్త చరిత్ర’ అంటూ సొంత పత్రిక సాక్షిలో రాయించారు. తర్వాత సీఎం అయ్యాక జగన్ విచారణ సమయంలో సైతం అవినాష్ ని సమర్దింస్తూ పలుమార్లు మాట్లాడారు. వీటిపై అనుమానంతో సునీత సీబీఐ దర్యాప్తు కావాలంటూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించడం.. సీబీఐ రంగంలోకి దిగడం.. మర్డర్ అవినాష్, భాస్కర్ రెడ్డి ల చుట్టూ తిరగడం.. ఇవన్నీ లోతుగా పరిశీలించేవారికి జగన్ పైన అనుమానం రాక మానదు. జగన్ ఒక వైపు, సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మర్డర్ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి ,, భారతికి ఫోన్ చేసిన వ్యవహారం బయటపడితే జగన్, భారతి కూడా ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది. దీని నుంచి వాళ్ళ వరకు ఏదో విధంగా తప్పించుకున్నా.. ప్రజాకోర్టులో మాత్రం తప్పించుకోవడానికి ఆస్కారం చాలా తక్కువనే చెప్పాలి.