రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా 100 రోజుల ఎజెండాపై చర్చించారు.
2024 మేలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆ తర్వాత త్వరితగతిన అనుసరించాల్సిన 100 రోజుల ప్రణాళికపై ఈ భేటీలో చర్చించారు. ఇక వికసిత్ భారత్-2047 ప్రణాళికలో భాగంగా వందేళ్ల స్వాతంత్ర్య భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడమే ఈ వికసిత్ భారత్ ప్రణాళిక. 2047 నాటికి భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తి అవుతాయి.
వికసిత్ భారత్ రోడ్మ్యాప్లో సమగ్రమైన బ్లూప్రింట్, ఆకాంక్షలు, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు పొందుపరిచారు. దీనిలో భాగంగా ప్రభుత్వం 2లక్షలకు పైగా యువత నుంచి సలహాలను కూడా తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) గా మార్చడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.