ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా సొంతంగా డౌన్లోడ్ చేసుకొనే వీలుంది.
ఏపీ ఎఎస్సెస్సీ వెబ్సైట్లోకి వెళ్లి విద్యార్థి, జిల్లా, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.