ప్రమాదవశాత్తూ 18వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ 12వ తరగతి బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ బాలిక(18) జారి పడిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు.
బిసార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ ప్రైడ్ సొసైటీలో బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందిందని తెలిపారు. ఇటీవలే ఆమె 12వ తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు.