ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానంటూ కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన మొహమ్మద్ రసూల్ కడారే హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. నిందితుడిని జిల్లాలోని రంగంపేటకు చెందిన వాడుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడు దానిని ఫేస్బుక్లో షేర్ చేశాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ, సీఎం యోగిని చంపేస్తానని వీడియోలో మాట్లాడాడు. అంతే కాదు చేతిలో పదునైన ఆయుధం కూడా ఉంది. రసూల్ హైదరాబాద్లో దినసరి కూలీగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.