ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ తారలు, క్రికెట్ దిగ్గజాలు ఈ వేడుకల్లో మెరిశారు. హాజరైన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కు అవమానం జరిగిందనే వార్త వైరల్ అవుతోంది.
ఆ వేడుకలకు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెళ్లాడు. వేడుకల సందర్భంగా వేదికపై షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ డ్యాన్స్ చేశారు. చరణ్ ను షారుక్ ఖాన్ వేదికపైకి పిలిచారట. అయితే చరణ్ ను పిలిచే సందర్భంగా.. ‘ఇడ్లీ సాంబార్’ పైకి రా అని షారుక్ అన్నారట. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. చరణ్ ను ఇండ్లీ సాంబార్ అంటూ షారుక్ పిలవడం నచ్చలేదని ఆమె పోస్ట్ పెట్టింది.