విదేశీ ఉద్యోగులకు మన దేశంలోని కొన్ని నగరాలు నరకప్రాయాలయ్యాయి. అందులో ముఖ్యంగా ఐదు నగరాలున్నాయి. ఈ విషయాలను బయటపెట్టింది ఒక సర్వే. ముఖ్యంగా మన దేశానికి వచ్చే విదేశీ ఉద్యోగులు ఈ నగరాల్లో నివసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదేనని తెలిపింది. ఈ మేరకు మేనేజ్మెంట్ కన్సల్టన్సీ కంపెనీ మెర్సెర్స్ ‘మెర్సెర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్’ ను విడుదల చేసింది. దీని ప్రకారం ముంబై మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి.
మెర్సెర్స్ ర్యాంకింగ్స్ బట్టి చూస్తే దేశంలో విదేశీ ఉద్యోగులకు అత్యంత చౌక అయిన నగరాలుగా పుణె, కోల్కతా. హౌసింగ్, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదంతో సహా 200 కంటే ఎక్కువ వస్తువుల ధరను పరిశీలించి ఆయా నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. తమ ఉద్యోగులను ఇతర దేశాలకు పంపేటప్పుడు అక్కడి పరిస్థితులను తగ్గట్టు ఉద్యోగులకు పరిహారం అందించడానికి కంపెనీలకు ఈ సర్వే డేటా సాయపడుతుందని మెర్సెర్స్ అభిప్రాయపడింది. ప్రపంచం మొత్తంలో విదేశీ ఉద్యోగులకు జీవన వ్యయం అధికంగా ఉన్న నగరాల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క స్విట్జర్లాండ్లోని నాలుగు నగరాలు రెండు నుంచి ఐదో స్థానం వరకు ఉన్నాయి.