శనివారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకోవచ్చని సెంట్రల్ రుయత్ ఈ హిలాల్ కమిటీ (The Central Ruet e Hilal Committee) ప్రకటించింది. న్యూఢిల్లీ, లక్నో, శ్రీనగర్, జైపూర్, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రంజాన్ పండుగ (ramzan eid) సందడి మొదలైంది. ముస్లిం సోదరులు తినుబండారాలు, ఇతర వస్తువులు కొనుగోళ్లు జరుపుతున్నారు. మార్కెట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ చార్మినార్ (Charminar) వద్ద రద్దీ నెలకొంది. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన వారు నేడు విరమించనున్నారు. వాస్తవానికి ఇవాళే రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలు కూడా చేశారు.