యూఐడీఏఐ తన వెబ్సైట్, మొబైల్ యాప్లో మరో కొత్త సదుపాయం కల్పించింది. పౌరులు తమ ఆధార్ నంబర్తో అనుసంధానం చేసిన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీలను వెరిఫై చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు యూఐడీఏఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
తమ ఆధార్తో ఏ ఫోన్ నంబర్, ఈమెయిల్ లింక్ అయిందనే విషయం కొంతమందికి తెలియని సందర్భాలను గుర్తించిన యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకొన్నది. అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్లో వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్ అనే సెక్షన్లో ఈ కొత్త సదుపాయం ఉంటుందని తెలిపింది.