‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన రామ్ పోతినేని తాజా చిత్రం ‘ది వారియర్’ . కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది.
ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్నిరోజులుగా విస్తృతంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ది వారియర్’ మూవీలో రామ్, ఆది పినిశెట్టి పోటీపడి నటించారని మూవీ ఘన విజయం సాధించి రామ్ ఇమేజ్ను మరింత పెంచుతుందని చిత్ర బృందం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది.