”సినీ అభిమానులలో చాలా మందికి ఒక డౌటుంది . మహేష్ బాబు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి? ఏభై ఏళ్ల వయసుకి చేరువవుతున్నా ఆ గ్లామర్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు…”? అని అనుకుంటారు. ఇదే అనుమానాన్ని తెలుసుకునేందుకు.. సుమ ఇంటర్వ్యూలో మహేష్ ని అడిగింది. ‘మహేష్ ఏం తింటారు? తినరు’ అని అడగడంతో మహేష్ కొన్ని విషయాలని మనసు విప్పి చెప్పారు. ”చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను. పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి మాత్రం అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. దాదాపు ఒక 10 ఏళ్లకు పైనుంచే ఫుడ్ లో కేర్ తీసుకుంటున్నాను. మొదట కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది” అని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన టీం తాజాగా ఓ ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు. యాంకర్ సుమతో మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ ఇంటర్వ్యూని విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ చాలా ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. ….ట్రైలర్లో అందం గురించి మెయింటైన్ చేయలేక దూల తీరిపోతుంది అని చెప్పిన డైలాగ్ ని మహేష్ గారిని చూసే పెట్టాను అని డైరెక్టర్ పరశురామ్ చెప్పుకొచ్చారు.