దక్షిణాది ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు, ప్రతాప్ పోతేన్ చెన్నైలోని తన ఫ్లాట్లో శవమై కనిపించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ప్రముఖ హీరోయిన్ రాధిక మాజీ భర్త అయిన ఆయన ప్రస్తుతం చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఆయన మరణ వార్త దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదాన్ని నెలకొల్పింది.
2012లో 22 మహిళా కొట్టాయం చిత్రానికి విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు, మరియు 2014లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు – ప్రత్యేక జ్యూరీ అవార్డు కుడా అందుకున్నారు. ప్రతాప్ తెలుగులో ఆకలి రాజ్యం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, చుక్కల్లో చంద్రుడు, మరోచరిత్ర, వీడెవడు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.