అభివృద్ధి మాటల ఉన్నా, ప్రధాని మోదీ ) పాలనలో దేశం పరిస్థితి, జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… . అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. రూపాయి విలువ రోజు రోజుకి క్షీణిస్తుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్కు శ్రీలంక పరిస్థితి వస్తుందని అన్నారు. రాజపక్సే దుస్థితి రాకుండా మోదీ, జగన్ జాగ్రత్త పడడం మంచిది,, అని తులసిరెడ్డి హితవుపలికారు.