‘పరిసరాల పరిశుభ్రత సక్రమంగా లేకపోవడంతోపాటు.. సీజనల్ గా దోమలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రస్తుత సీజన్ జ్వరాల సీజన్.. అందులో చాలా మంది డెంగ్యూ జ్వరాల బారీన పడుతున్నారు. ఈ జ్వరం చాలా ప్రమాదకరం.. ఎందుకంటే.. ఈ జ్వరం శరీరంలోని తెల్ల రక్తకణాలను పూర్తిగా తగ్గించేస్తుంది. తెల్ల రక్తకణాలు తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం.. ఈ జ్వరం నుంచి తప్పించుకోవాలంటే …దాని గురించి కొంతైన అవగాహన ఉండాలి.
అసలు ఈ డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది? దేని వల్ల వస్తుంది? అనే దానిపై అవగాహన ఉండాలి. డెంగ్యూ జ్వరం దోమల వల్ల వస్తుంది. ఈడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందుతుంది. అంత భయంకరమైన ఈ దోమ ఎలా ఉంటుంది? ఏ సమయంలో ఇది కుడుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ సమయంలో కుడుతాయి?
ఈ డెంగ్యూ వ్యాప్తికి ఈడిస్ ఈజిప్టి అనే దోమ కారణం. దీనిని ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ డెంగీ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల సయమం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో కుట్టే దోమలపై జాగ్రత్తగా ఉండాలి.
నీరు నిల్వ ఉన్న చోట,డ్రైనేజీ లలో, తడి ప్రదేశాలలో డెంగ్యూ దోమలు గుడ్లను పొదుగుతాయి. అవి 3 సంవత్సరాల వరకు జీవించగలవు. కాబట్టి మూలల్లో తడిగా లేకుండా చూసుకోవాలి.