ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్ను శాశ్వత సభ్యదేశంగా చేయడానికి ఫ్రాన్స్ మరోమారు తన మద్దతును ప్రకటించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలు గురించి తెలిపింది.
భారత్ తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరింది. ఐరాస భద్రతా మండలిలో ఐదు సభ్య దేశాలు ఉండగా.. చైనా మినహా మిగిలిన నాలుగు దేశాలు .. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలు మనకు మద్దతు పలికాయి.