”కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కంటే కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువ” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ్యవస్థ విఫలం కావడానికి కూడా కొవిడే కారణమని డబ్ల్యూహెచ్వో, ఇతర నిపుణులు పదేపదే చెప్పారు. ‘కరోనా వైరస్తో చిన్న ప్రమాదం ఉన్నది. టీకా వల్ల కలిగిన రోగ నిరోధక శక్తిని అధిగమించేలా అది పరివర్తన చెందవచ్చు. కాబట్టి నిరంతర పర్యవేక్షణ, జాగ్రత్తలు అవసరం’ అని సౌమ్య స్పష్టం చేసారు. అంతర్జాతీయ స్థాయిలో కొవిడ్ ఒక ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొనసాగుతుందని గత నెల మొదట్లో డబ్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ ప్రకటించిన విషయం తెలిసిందే.